బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీటీసీ

నవతెలంగాణ – తొగుట
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని ఎంపీటీసీ వేల్పు ల స్వామి పరామర్శించారు. ఆదివారం మండలం లోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎండీ. చాన్ భార్య శనివారం రాత్రి అనా రోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసు కున్న ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ వేల్పుల స్వామి వారి కుటుంబాన్ని పరామర్శించి, 50 కిలోల బియ్యం అందజేశారు. ఆయన వెంట గ్రామ శాఖ అధ్యక్షు లు నందరం వెంకటేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు భాస్కర్, కనకరాజు, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు బుర్ర ఎల్లా గౌడ్, సోషల్ మీడియా బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love