మృగశిర కార్తి హోరు..చేపల విక్రయాల జోరు..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండల కేంద్రంలో మృగశిర కార్తె పురస్కరించుకొని శనివారం బోయ కులస్తులు చెరువులలో చేపలు పట్టి మార్కెట్కు తరలించడంతో రైతులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ చేపలను కొనుగోలు చేయడం విశేషం. వర్షాకాలం ప్రారంభమయ్యే మృగశిర కార్తి నీ పురస్కరించుకొని రైతులు ఆనందోత్సవంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు నుండి వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దుండడం వరి నాట్లు వేయడం వ్యవసాయ పనులలో నిమగ్నమవుతారు. మండల కేంద్రానికి చెందిన బోయ కులస్తులు ఉదయం నాలుగు గంటల నుంచి చెరువులలో చేపలు పట్టి తీసుకురాగా, క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.
Spread the love