వెల్ఫేర్ డే ప్రోగ్రాం కోసం ముమ్మర ఏర్పాట్లు

–  పరిశీలించిన తాహశీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, పశువైద్య డాక్టర్

నవతెలంగాణ మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఈనెల 9న జుక్కల్ నియోజకవర్గంలో స్థాయి వెల్ఫేర్ డే ప్రోగ్రాం మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నారు.  అందుకు వేదికైన మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ ను ఎంపీడీవో గౌడ్, తాహశీల్దార్ అనిల్ కుమార్, పశు వైద్య డాక్టర్ బండివార్ విజయ్, స్థానిక సర్పంచ్ సురేష్, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వపరంగా నిర్వహించే వెల్ఫేర్ డే ప్రోగ్రాం నియోజకవర్గస్థాయి కోసం అధికారులు ఏర్పాట్ల కోసం నిమగ్నమయ్యారు. నియోజకవర్గస్థాయి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొంటారని మండల అధికారులు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఎంపీడీవో, తాహశీల్దార్ తెలిపారు
Spread the love