నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ శ్రీవాణి

నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల నూతన ఎంపీడీవో గా ఎన్ శ్రీ వాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వృత్తిపరంగా తనపై నమ్మకంతో శంకరపట్నం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించినందున మండలంలోని గ్రామాల అభివృద్ధికై పాటుపడతానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి ఎంపీడీవో ఎండి  బషీరుద్దీన్,ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీవో శ్రీవారిని ఘనంగా సన్మానించారు.
Spread the love