ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
 ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కర్లపల్లిలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం”కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పాఠశాల వ్యాయమ ఉపాద్యాయులు యాలం.ఆదినారాయణ ని ప్రధానోపాధ్యాయులు శ్రీ.కల్తి. శ్రీనివాస్  మరియు ఉపాద్యాయులు శాలువాలు పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ధ్యాన్ చంద్  జీవితం ఆదర్శంగా తీసుకోవాలని చదువు తో పాటు క్రీడల్లో ముందుండాలని సూచించారు.పి.డి ఆదినారాయణ  మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఆడాలని తెలిపారు ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love