- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి ముకుందరెడ్డికి నవతెలంగాణ దినపత్రిక బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. మంగళవారం హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని సమాచార్ భవన్లో స్పెషల్ కమిషనర్ను నవతెలంగాణ దినపత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్, సంపాదకులు రాంపల్లి రమేష్, జనరల్ మేనేజర్లు ఎం. వెంకటేష్, పి. నరేందర్రెడ్డి, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు బి. బసవపున్నయ్య కలిశారు. ఈసందర్భంగా స్పెషల్ కమిషనర్కు దేశ రాజ్యాంగం పుస్తకంతోపాటు ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ రాసిన ఆఖరి యోధులు పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలపై చర్చించారు.
- Advertisement -



