వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి..

– ప్రయివేటు ఆస్పత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద గల ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన పిట్ల సుమలత అనే మహిళ మగ శిశువుకు జన్మనిచ్చి మృతి చిందగా, వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. గురువారం మధ్యాహ్నం సిజేరియన్ చేయగా, బాబు జన్మించినట్టు తెలిపారు. ఉమ్మినూరు ఉండడంతో బాబును పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లి వచ్చినట్టు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో మత్తు మందు వికటించి చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించినట్టు బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని నిరసన చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట పోలీసులు మోహరించారు. మృతురాలి భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్ళగా నాలుగు సంవత్సరాల బాబు సాయికుమార్, మూడు సంవత్సరాల వర్షిని, అనాధలు అయినట్టు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Spread the love