సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఉత్పత్తులు

గురుగావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి పలు నూతన ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో గెలాక్సీ ఫోల్డబుల్స్‌ ఐదవతరం, వాచ్‌ 6సిరీస్‌, టాబ్‌ ఎస్‌9 సిరీస్‌లు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. గెలాక్సీ వాచ్‌6, క్లాసిక్‌లను ఆవిష్కరించింది. ఈ రెండింటి ధరలను వరుసగా రూ.29,999గా, రూ.36,999గా నిర్ణయించింది. ట్యాబ్‌ ఎస్‌ సీరిస్‌లో అల్ట్రా, ఎస్‌9 ఫ్లస్‌, ఎస్‌9 వేరియంట్లను విడుదల చేయగా.. వీటి ధరలను రూ.1,19,999గా, రూ.90,999గా, రూ.96,999గా ప్రకటించింది. ఆయా ఉత్పత్తులపై పలు రాయితీలను అందిస్తున్నట్టు తెలిపింది.

Spread the love