Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీలకతీతంగా గో ఆరాధన ఉద్యమ ర్యాలీ

పార్టీలకతీతంగా గో ఆరాధన ఉద్యమ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజలందరూ గో ఆరాధన ఉద్యమ ర్యాలీ సోమవారం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరుకొని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతలతో గోశాల నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తహశీల్దార్ ముజీబ్ కు వినతిపత్రం అందజేశారు. గో వంశ సంరక్షణ, గోవును దేశమాతగా, ఓన్నత్య త్యాగానికి చిహ్నంగా గౌరవించాలని అన్నారు. దేశీయ గోవులను నదులతో సమానంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -