మౌనిక గోనెకి ఎన్టీఆర్ విశిష్ట సేవ పురస్కారం 

నవతెలంగాణ – సిద్దిపేట : ఆర్ .కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ వారు  తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదలో జరిగినా విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ పద్మశ్రీ  నందమూరి తారక రామారావు  శత జయంతి సంబరాలు సందర్భంగా తనకు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారం అందజేసినట్లు జిల్లాకు చెందిన  విజ్ఞరాజా కూచిపూడి అకాడమీ నాట్య గురువు  నాట్య విజ్ఞాన్ మౌనిక గోనె తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, ప్రముఖ నటుడు ప్రసన్న కుమార్, డా.లయన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, ఆర్ కే ఫౌండేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు తెలిపారు. మౌనికను పలువురు ఈ సందర్భంగా అభినందించారు.
Spread the love