ఆపరేషన్‌ గజ సక్సెస్‌..

నవతెలంగాణ-చిత్తూరు : ఏపీలోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించాయి. చిత్తూరు  జిల్లా రామాపురం వద్ద ఏనుగు సంచరిస్తుందని సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చెరుకుతోటలో ఉన్న ఏనుగును గమనించి దానికి మత్తు ఇంజిక్షన్‌ ఇచ్చి బంధించారు. ఇదే ఏనుగు చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం రామాపురంలో వెంకటేశ్‌, సెల్వి దంపతులపై దాడి చేపి చంపివేసింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట కూడా ఏనుగు మరో వ్యక్తిపై దాడి చంపింది. సి.కె పల్లి గ్రామంలో కార్తీక్‌ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది.

Spread the love