– డీఎంఈకి జూడాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉపకార వేతనాన్ని (స్టయిఫండ్) చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) డీఎంఈకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం టీజూడా రాష్ట్ర నాయకులు హైదరాబాద్ లో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకురాలు డాక్టర్ వాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆయా ఆస్పత్రుల్లో డాక్టర్ల భద్రత, డీఆర్పీ సమస్య, రెసిడెంట్లకు బాండ్లు, హాస్టళ్లలో సదుపాయాల లేమి, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం తదితరాంశాలపై వారు ఆమెతో చర్చించారు.