ప్రగతిశీల తెలంగాణను నిర్మిద్దాం

– ఉగాది సందర్భంగా గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తితో ప్రగతిశీల తెలంగాణను, స్వావలంబన భారతాన్ని నిర్మిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావహ దృక్పథంతో ఎదుర్కొనేందుకు సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రాజ్‌భవనలో నేడు సాంస్కృతిక ప్రదర్శనలు
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ గవర్నర్‌… సీఎం, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రదర్శనల అనంతరం తేనీటి విందు ఇవ్వనున్నారు.

Spread the love