అధిక బరువు వల్లే మహిళల్లో పీసీఓఎస్‌

– జీవనశైలి మార్పులతో తగ్గించుకునే అవకాశం
-ఆహారపు అలవాట్లలో మార్పులపై ఉచిత శిబిరం
– సెంచురీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహణ
– నవతెలంగాణ-సిటీబ్యూరో
పోషకాహార లోపమే పలు రకాల వ్యాధులకు కారణం అవుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) అనే సమస్య కూడా అధిక బరువు వల్లే వస్తుంది. దాని వల్లే శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. నేటి ఆధునిక జీవన శైలిలో శారీరక వ్యాయామం తగినంత గా లేకపోవడం, దానికితోడు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడంతో స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆహారంలో చిన్నచిన్న మార్పు లు చేసుకోవడం, ఇతర చర్యల ద్వారా శారీరక ఆరోగ్యా న్ని ఎలా కాపాడుకోవాలన్న విషయమై సెంచురీ హాస్పి టల్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత శిబిరం నిర్వహిం చారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ తరణి నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో ఎవరి శరీరానికి ఎలాంటి ఆహారం, ఎంత మోతాదులో తీసు కోవాలనే అంశాలను వివరించారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్‌ 12లోని సెంచురీ హాస్పిటల్‌లో ఫ్రీ లైఫ్‌ స్టైల్‌ మాడిఫికేషన్‌ ప్రోగ్రాంలో భాగంగా రూ.2వేల విలువ చేసే” డైట్‌ ప్లాన్‌, డైటీషియన్‌ కన్సల్టేషన్‌” ఉచి తంగానే అందిస్తున్నామని డాక్టర్‌ తరణి నాయుడు వెల్ల డించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు” ఫ్రీ లైఫ్‌ స్టైల్‌ మాడిఫికేషన్‌ ప్రోగ్రామ్‌” నిర్వహించారు. ఈ అవకా శాన్ని 200 మంది సద్వినియోగం చేసుకున్నారు. స్థూల కాయం, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్‌, కిడ్నీ వంటి వ్యాధుల్లో ఆహారమే ప్రధాన పాత్రను పోషి స్తుందని వివరించారు. ఆహారం విషయంలో జాగ్రత్త లు పాటిస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలన్నింటినీ నియంత్రించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. మనం తీసుకునే రోజువారి ఆహారంలో సమతుల్యతను పాటిస్తూ అన్ని పదార్ధాలనూ తీసుకోవాలని తరణి నాయుడు తెలిపారు. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి ఆహారం సరిపోతుందన్నది వేర్వేరుగా ఉంటుందనీ, దానికి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు మార్చు కోవాలని చెప్పారు. తమ ఆరోగ్యాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ప్రధానంగా కార్పొరేట్‌ వెల్‌నెస్‌, హెల్త్‌ టాక్‌ తదితర అంశాలను నిర్వహించారు.

Spread the love