బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా పెద్దొల్ల శ్రీనివాస్

నవతెలంగాణ – బెజ్జంకి
బీఎస్పీ కరీనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ నియామకమైయ్యారు.కరీంనగర్ జిల్లా బీఎస్పీ జిల్లాధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ బుధవారం శ్రీనివాస్ యాదవ్ కు నియామకపత్రం అందజేశారు. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ సారథ్యంలో బీఎస్పీ పార్టీని మరింత బలపర్చి బహుజన రాజ్యాధికారం కోసం శాయశక్తుల కృషి చేస్తానని.. నాపై నమ్మకంతో కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యవర్గ సభ్యుల నియామకానికి సహకరించిన జిల్లా, నియోజవర్గ, మండల బీఎస్పీ నాయకులకు శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love