నవతెలంగాణ హైదరాబాద్: తోటి విద్యార్థినుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో చోటు చేసుకుంది. సీఐ సోమ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చారకొండ మండల కేంద్రానికి చెందిన అనూష (23) హైదరాబాద్ షేర్గూడలోని ఓ ప్రయివేట్ కళాశాలలో
బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. రంగారెడ్డి జిల్లా మంగలపల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలో కళాశాల, వసతిగృహాల్లో తోటి విద్యార్థినులు వేధిస్తున్నారంటూ సోదరుడు విజేందర్గౌడ్కు చెప్పడంతో ఆదివారం రాత్రి అనూషను ఇంటికి తీసుకొచ్చారు. విజేందర్ సోమవారం ఉదయం తల్లిదండ్రులను పొలం వద్ద వదిలిపెట్టేందుకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి అనూష ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి యాదయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.