పోలింగ్ రోజు కూడా ఓటర్లకు ప్రలోభాలు

– పోలింగ్ కేంద్రాల్లోకి చోచ్చుకెల్లి ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు.
– చూసి చూడనట్లు వివరిస్తున్న పోలీసులు.
నవతెలంగాణ – మంచిర్యాల
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ జోరుగా సాగుతుంది. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ వివిధ పార్టీల నాయకులు ఓటును అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటూ తమ పార్టీలకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లి మరి చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ ఉన్నా కూడా ఎవరూ లెక్క చేయడం లేదు. ఇదంతా పోలీస్ సిబ్బంది ముందే జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు చొరవ తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.
Spread the love