సూపర్స్టార్ కష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శరణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’. శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ను డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ మూవీతో శరణ్కు మంచి పేరు రావాలని, కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న శివకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని ఆర్.యు.రెడ్డి అన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ,’ఈనెల 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. ”సాక్షి’ సినిమా రిలీజ్ డేట్ను వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని హీరో శరణ్ తెలిపారు. ‘టీం అంతా సహకరించింది. భీమ్స్ మంచి సంగీతాన్ని అందించారు. హీరో శరణ్ ఎంతో చక్కగా నటించారు. మంచి కాన్సెప్ట్తో రూపొందిన సినిమా ఇది’ అని దర్శకుడు శివ చెప్పారు.
ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా, నాగబాబు మెయిన్ విలన్గా కనిపించబోతున్నారు. అజరు, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.