భారతీయుల అరెస్ట్‌పై స్పందించిన కెనడా ప్రధాని

నవతెలంగాణ – టొరంటో: తమ దేశంలో చట్టబద్ధమైన పాలన ఉందని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉందని, దేశ పౌరులను రక్షించడం తమ ప్రాథమిక విధి అని అన్నారు. ఖలిస్థానీ వేర్పాటు వాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో సంబంధముందని ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులపై ట్రూడో స్పందించారు. రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్‌సిఎంపి)  దర్యాప్తు కొనసాగుతోందని ట్రూడో పేర్కొన్నారు.  నిజ్జర్‌ హత్య తర్వాత కెనడాలో సిక్కు సమాజంలో చాలా మంది అసురక్షితంగా భావిస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రతి కెనడియన్‌ వివక్ష, హింస, బెదిరింపులు లేకుండా సురక్షితంగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని అన్నారు. శనివారం అరెస్టయిన ముగ్గురు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యేకమైన దర్యాప్తు జరుగుతుందని ట్రూడో పేర్కొన్నట్లు కెనడియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పోరేషన్‌ (సిబిసి) స్పష్టం చేసింది.

Spread the love