చిన్నారుల ప్రతిభకు ప్రాధాన్యం

నవతెలంగాణ – అశ్వారావుపేట
చిన్నారులు ప్రతిభకు అంగన్వాడీ కేంద్రాలు ప్రాధాన్యతను ఇస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాదేళ్ళ సౌజన్య స్పష్టం చేశారు. ముఖ్యం పిల్లల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. మండలంలోని మొద్దులు మడ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం వార్షిక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్ శ్యామల, ఆశ వర్కర్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Spread the love