రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించిన పేద విద్యార్ధిని లక్ష్మి ప్రియాంక

నవతెలంగాణ – అశ్వారావుపేట
సత్తుపల్లి శ్రీవాణి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జయవరపు లక్ష్మి ప్రియాంక కు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 436 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించింది. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో అశ్వారావుపేట మండలం,కొత్త మామిళ్ళవారిగూడెం కూ చెందిన జయవరపు లక్ష్మి ప్రియాంక ఇంటర్ ఫలితాల్లో బైపిసి 436/440 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించింది.తమ కూతురు రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు జయవరపు కేశవరావు,బాల త్రిపుర సుందరి సంతోషం వ్యక్తం చేశారు.అదేవిధంగా శ్రీవాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, గ్రామస్తులు జయవరపు లక్ష్మి ప్రియాంక కు అభినందనలు తెలిపారు.
Spread the love