క్షయ వ్యాధి గ్రస్థులకు పౌష్టికాహార కిట్స్ అందజేత

నవతెలంగాణ – కంటేశ్వర్
టీబి ముక్త్ భారత్ లో భాగంగా నిజామాబాదు ఏ ఆర్ టి సెంటర్ లో క్షయ వ్యాధి గ్రస్థులకు పౌష్టికాహార కిట్స్ ని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ సుదర్శనం చేతుల మీదుగా శుక్రవారం అందించారు. టిబి వ్యాధి పౌష్టికార లోపం అనే ఒక కారణం తో వచ్చే అవకాశం ఉందని ఇలాంటి అబాగ్యులకు అండగా ఆత్మీయ భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చిన సూర్య హెల్త్ ఆర్గనైజషన్ ని అభినందించారు వీళ్ళు 40మంది కి ఈరోజు కిట్స్ ని అందజేశారని ఇలాగే ఇంకా దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో సూర్య హెల్త్ ఆర్గనైజషన్ రాజేందర్, ఎ.ఆర్.టి. మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్,డా సంతోష్,జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, డీపీఎం సుధాకర్ , మహేందర్, హరీష్,వినోద్, సన్నీ మరియు ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

Spread the love