ప్రభుత్వ విప్ సహకారంతో గ్రామాల అభివృద్ధి

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ముదిరాజ్ సంఘ భవనానికి 4 లక్షలు, వీడీసీ భవన మరమ్మతులకు 4 లక్షలు, ముదిరాజ్ సంఘానికి బోరు మోటర్, హనుమాన్ ఆలయ నూతన నిర్మాణం, ఆలయ ప్రాంగణంలో బోరు మోటర్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రభుత్వ విప్ కు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపి, గ్రామ ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love