నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీ మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడపనుంది.