నవతెలంగాణ – రామగిరి
సింగరేణి సంస్థలో జరుగుతున్న స్వచ్ఛత పక్షవాత్సవాల భాగంగా గురువారం అర్జీ-3 ఏరియాలోని సెంటినర కాలనీ టి-2 క్వార్టర్స్ పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించారు. ఈకార్యక్రమంలో పర్సనల్ డిజీఎం విలాస్ శ్రీనివాస్ పోద్దార్, ఇంచార్జి పర్యావరణ అధికారి బి.వి.సత్యనారాయణ, డివైపీఎం కె మారుతి, శానిటరీ ఇన్స్పెక్టర్ అంజనేయులు, సివిల్ సూపర్వైజర్ యాకూబ్ పాష పాల్గొన్నారు.