అభివృద్ధి కోసం హరీశ్ రావును కలిశానన్న రాజాసింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి హరీశ్ రావుతో గోషామహల్ రాజాసింగ్ భేటీ అయిన విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో, రాజాసింగ్ పార్టీ మారుతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ… తన నియోజకవర్గంలో ఆస్పత్రి అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని చెప్పారు. గోషామహల్ లో ఉన్న ఆసుపత్రిని 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని కోరానని తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను బీజేపీలోనే ఉంటానని, బీజేపీలోనే చస్తానని తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. హిందూ దేశం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.

Spread the love