రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు

నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రాజేశ్వర్‌ రావు గురువారం బాధ్యతలు  స్వీకరించారు. తన పైన ముఖంతో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు, సహకరించిన నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎంపి.సురేష్ రెడ్డి,ఎమ్మెల్సి ఎల్.రమణ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love