RCB vs GT : విల్ జాక్స్ విధ్వంసం..ఆర్సీబీకి భారీ విజయం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్, ఆర్సీబీ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగలు లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టుకు మంచి ఓపెనింగ్ దక్కింది. 40 పరుగుల వద్ద ఆర్సీబీ మొదటి వికెట్ కోల్పోగా క్రీజులోకి విల్ జాక్స్ వచ్చాడు. మొదటి నుంచి దీటుగా ఆడుతున్న కోహ్లీ విల్ జాక్స్ తో కలిసి పరుగుల వరద పారించాడు. అలాగే విల్ జాక్స్ గుజరాత్ బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఏకంగా 10 సిక్సర్లు 5 ఫోర్లతో 41 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో ఆర్సీబీ జట్టు 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే చేదించి 9 వికెట్ల విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్లతో రెచ్చిపోయి.. 84 పరుగులు చేశాడు. ఈ విజయంతో ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవం చేసుకుంది.

Spread the love