సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్‌లో సోమవారం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు 1.21లక్షల మందికిపైగా విద్యార్థులు చేసుకున్నారు. ఏప్రిల్ 23న నిర్వహించిన పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు. తెలంగాణ సోసషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 232 మంది, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 77 మంది, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 146, ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 35 సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో 50 శాతం సీట్లు నియోజకవర్గ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ సంవత్సరం పది శాతం EWS కోటాను ప్రవేశపెట్టినట్లు వివరించారు. అదనంగా ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఎనిమిది సీట్లు కల్పించినట్లు చెప్పారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

Spread the love