మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి సుగుణ సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. కాగా ఆ గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య మృతురాలి కుటుంబాన్ని పరామర్శించే పరామర్శించి ఆమె మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త పోచయ్యకు రూ.2వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మాడ రవీందర్ రెడ్డి, చింతల రాజయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love