ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లపై పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై అంతకుముందు హైదరాబాద్ సీపీ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ సాగుతోందన్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ఈ కేసులో చాలామంది ప్రమేయం ఉందని తెలుస్తోందన్నారు. ప్రభాకర్ రావును పట్టుకోలేదనేది అవాస్తవమన్నారు. దర్యాఫ్తు అధికారులకు ప్రభాకర్ రావు అందుబాటులోకి రాలేదన్నారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను వెల్లడిస్తామన్నారు.

Spread the love