ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను అభినందించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతో పాటు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. MPC లో 1000 మార్కులకు గానూ 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.

Spread the love