విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

నవతెలంగాణ – విజయవాడ: విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఉన్న‌ ఖైదీ మృతిచెందడం క‌ల‌క‌లం రేగింది. విజ‌య‌వాడ వ‌న్‌టౌన్ గొల్ల‌పాలెంకు చెందిన బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అనే ఆటో డ్రైవ‌ర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయ‌స్థానం రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న అత‌డు గురువారం ఉద‌యం త‌న బ్యార‌క్‌లో స్పృహ త‌ప్పిప‌డి ఉండ‌టం పోలీసులు గుర్తించారు. దాంతో వెంట‌నే బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌ను పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. అస‌లు అత‌డు ఎలా మృతిచెందాడు మృతి గ‌ల కార‌ణం తెలియాల్సి ఉంది.

Spread the love