నగదు అందజేస్తున్న వైయూపీపీ టీవీ సంస్థ ప్రతినిధులు

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో వచ్చే నెల జూన్ 3,4,5 తేదీలల్లో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ( గ్రామశిల) సహిత పోచమ్మ ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించనున్నారు. కాగా ఈ విషయాన్ని గ్రామస్తులు వైయూపీపీ టీవీ, ట్యురిటో సంస్థల అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఉత్సవాలకు రూ.లక్ష విరాళంగా పంపించగా ఆ నగదును ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఉత్సవ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుజాత-లక్ష్మణ్ ఉదయనందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మ్యాకల సమ్మిరెడ్డి, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ అయిలయ్య యాదవ్, పురంరెడ్డి సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, మర్రి రవి, సమిండ్ల చిట్టి, మర్రి సమ్మయ్య, గోపు ఎల్లారెడ్డి, దాసారపు లోకేష్, వంశీ, గోపు పరుశురాం రెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, ఎం. రాజిరెడ్డి, చిన్నాల శ్రీకాంత్, గోపు వెంకట్ రెడ్డి, పస్తం కుమార్, లింగాల మల్లారెడ్డి, ఉడుత సమ్మయ్య, కొమురయ్య, లస్మక్కపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love