దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ-నవీపేట్: దళిత బంధు పథకాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కార్యకర్తలకు సైతం ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే షకిల్ ఆమెర్ ను మంగళవారం ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలైన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కార్యకర్తలకు సైతం దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణికొల్ల గంగాధర్, ఆకారం రమేష్, వెలమల జీవన్, గంటు పద్మ, స్వప్న, గోపి, సంజీవ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love