- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని శనగ రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను తూకం వేసి నెలరోజులు అవుతోంది. అయినా ఇప్పటి వరకు తమకు నగదు చెల్లించలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. నేడు తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శనగ పంటను నగదును వెంటనే చెల్లించాలని అందులో పేర్కొన్నారు.
- Advertisement -



