జీజీహెచ్ లో రోగులకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు

నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో త్రాగునీటి ప్లాంట్ (ఆర్ ఓ ప్లాంట్) ను  ఏర్పాటు చేసి, దీని వల్ల మంచి నీటి సౌకర్యం ప్రతి అంతస్తులో కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమారాజ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో రోగులకు వారి సహాయకులకు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈ త్రాగు నీటి ప్లాంట్ (ఆర్ ఓ ప్లాంట్) ఏర్పాటు చేశామని మంగళవారం తెలియజేశారు. రోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిమారాజ్ ఆసుపత్రి సూపరింటెండెంట్,  డాక్టర్   నాగేశ్వరావు , డాక్టర్ బాల్‌రాజ్, డాక్టర్ నరేంద్రకుమార్, డాక్టర్ కిరణ్, డాక్టర్ కమ్రాన్, డాక్టర్ హరీష్, డాక్టర్ సుజాత, డాక్టర్ స్వాతి మరియు ఆఫీసు సిబ్బంది,  నర్సింగ్ సిబ్బంది ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love