ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథా చిత్రం ‘రుద్రాక్షపురం’. ‘మెకానిక్’ ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా, ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది.
తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్, నటి – ఎన్నారై ప్రశాంతి హారతి, డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు. ‘రుద్రాక్షపురం’ అని ఈ చిత్రానికి టైటిల్ ఎందుకు పెట్టామని మాటల్లో చెప్పడం కంటే వెండితెరపై చూస్తూనే థ్రిల్లింగ్గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు.
రేఖా, రాజేశ్, అజరు రాహుల్, పవన్ వర్మ, శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: ఆర్ కె గాంధీ, సంగీతం:ఎం.ఎల్.రాజా – ఘంటాడికష్ణ – జయ సూర్య బొంపెం, స్టంట్స్: థ్రిల్లర్ మంజు- బాజి- స్టార్ మల్లి, కెమెరా: నాగేంద్ర కుమార్ ఎం, ఎడిటర్: డి.మల్లి, నత్యం: కపిల్ అన్నారాజ్. a