గ్రామాన్ని కాపాడే మల్లన్న…

Mallanna who saves the village...ఓటీటీలో విడుదలై నయా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సంపత్‌ నంది కథ అందించగా, అశోక్‌ తేజ దర్శకత్వం వహించారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా ‘ఓదెల2’ వస్తోంది. కథ, స్పాన్‌, కాస్టింగ్‌, ప్రొడక్షన్‌, సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది మ్యాసివ్‌గా ఉండనుందని మేకర్స్‌ తెలిపారు. లీడ్‌ రోల్‌లో తమన్నా నటిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్స్‌ ద్వారా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సంపత్‌ నంది క్రియేటర్‌గా ఉన్న ఈ చిత్రాన్ని అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ బ్యానర్‌లపై డి.మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం కాశీలో జరిగింది. రెగ్యులర్‌ షఉటింగ్‌ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశంతోపాటు పలు థ్రిల్‌ చేసే విషయాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. టైటిల్‌ పోస్టర్‌ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇది మల్లన్న స్వామిగా పూజించబడే శివుని త్రిశూలాన్ని చూపిస్తుంది. నెంబర్‌ 2 త్రిశూలం విభూతి, ఒక బిందీ శివలింగాన్ని చూడగలిగే విధంగా రూపొందించారు. ఇది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ, యువ, నాగ మహేష్‌, వంశీ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి, భూపాల్‌, పూజా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: డి మధు, దర్శకత్వం: అశోక్‌ తేజ, డిఓపీ : సౌందర్‌ రాజన్‌. ఎస్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌.

Spread the love