ఏర్గట్ల తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక వేలం

నవతెలంగాణ-ఏర్గట్ల: ఏర్గట్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో నేడు అనగా ఈ నెల 26 వ తేది బుధవారం రోజున ఉదయం 10.30 నిమిషాలకు ఇసుకను వేలం వేస్తున్నట్టు తహశీల్దార్ మహమ్మద్ యూసుఫ్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం బట్టాపూర్ గ్రామంలో గల ఊర గుట్ట వద్ద 50 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి పట్టుకున్నామని, పై అధికారుల ఆదేశాల మేరకు ఇసుకను వేలం వేస్తున్నామని,ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని అన్నారు.

Spread the love