- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పశువైద్యాధికారి డాక్టర్ వినీత్ కుమార్ మొదట మేనూర్ లోనే విధులు నిర్వహించారు. కొంతకాలానికి బదిలీపై వేరే మండలాలకు వెళ్ళారు. అయితే తాజాగా ఆయన తిరిగి బుధవారం బదిలీపై మేనూర్ కే వచ్చారు. ఈ క్రమంలో మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ వినీత్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వినీత్ కుమార్ సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి హరీష్ కుమార్, గ్రామ కారోబార్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



