మాజీ మంత్రి సమక్షంలో సొంత గూటికి సాయరెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: జిల్లా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సాయరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నుండి సొంత గూటికి కాంగ్రెస్ లోకి కండువా కప్పుకొని తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వార్డు సభ్యులు గోపాల్, కళావతి, సతీష్ మరియు సంజీవరెడ్డిలతో పాటు యువకులు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మండలంలోని తడగాం, అభంగపట్నం, మహంతం గ్రామాలలో పర్యటనలో భాగంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారని అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి అభివృద్ధి ప్రభుత్వం కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బూతు స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి మేనీఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తాహేర్ బిన్ హందాన్, మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, భగవాన్, గంగాధర్, బాబు, మూస తదితరులు పాల్గొన్నారు.

Spread the love