షెడ్యూల్‌ ఎంప్లాయీమెంట్స్‌లో పరిధిలోకి ఆహారశుద్ధి పరిశ్రమ, ఫుడ్‌పార్కులు

– ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసిన కార్మిక శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కనీస వేతనాల చట్టం -1948 ప్రకారం షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌ పరిధిలోకి ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్‌ పార్కులను కార్మిక శాఖ తీసు కొచ్చింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. షెడ్యూల్‌ ఎంప్లాయీమెంట్స్‌లో 73 ఉన్న సంగతి తెలిసిందే. కనీస వేతనాల చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం ప్రస్తుతం ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్‌ పరిశ్రమను 74 వది చేర్చుతున్నట్టు పేర్కొంది. దీనిపై ఎవరికైనా అభ్యంతరా లుంటే 3 నెలల్లోగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో గల అంజయ్య భవన్‌లో కార్మిక శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకురావాలని కోరింది. ఈ మేర కు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఐ.రాణి కుముదిని ఒక ప్రకటన విడుదల చేసింది.

Spread the love