సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు వేగినాటి మృతి

నివాళులర్పించిన తమ్మినేని, పోతినేని
నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌
ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, ప్రజా నాట్య మండలి జిల్లా కమిటీ సభ్యులు వేగినాటి వెంకటేశ్వర్లు (73) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వెంకటేశ్వర్లు మరణ వార్త తెలిసిన వెంటనే పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు జీవితాంతం ఎర్రజెండా అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడా రు. వెంకటేశ్వర్లతో తనకున్న బంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మృతునికి భార్య సత్యవతి, ఇద్దరు కుమారులున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, భూక్య వీరభద్రం, వై. విక్రమ్‌, మాదినేని రమేష్‌ తదితరులు ఉన్నారు.

Spread the love