గ్రూప్4 పరీక్షలకు 6 కేంద్రల ఏర్పాటు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
శనివారం జరగనున్న డిచ్ పల్లి మండలంలో గ్రూప్ 4 పరీక్షలకు సంబందించి 6 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపిడిఓ గోపి బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిచ్ పల్లి మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ధర్మారం (బి‌), ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఘన్ పూర్, తిరుమల నర్సింగ్ కాలేజ్ లో రెండు కేంద్రాలు, విక్టరి హై స్కూల్ ఏడవ బెటాలియన్ క్యాంప్, తెలంగాణ స్టేట్ మాడెల్ స్కూల్ డిచ్ పల్లి విలేజ్ లో 1944 అభ్యర్డులు పరీక్ష రాయడం జరుగుతుందని ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలాంటి లోటు పాట్లు లేకుండా పూర్తి చేయడం జరిగిందని ఎంపిడిఓ గోపి బాబు తెలిపారు. అభ్యర్ధులకు మొదటి పరీక్ష ఉదయం 9:45 లోపల, రెండవది మధ్యాహ్నం 2:15 లోపల పరీక్ష కేంద్రాలలో ఉండవలసి ఉంటుందని అభ్యర్థులు సమయానికి కంటే ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Spread the love