నవతెలంగాణ – ఉత్తర్ప్రదేశ్
ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్ అయిన కుమార్తెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. రామ్పుర్ జిల్లా సైఫాని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లైంగికదాడికి గురైన మహిళను, ఆమె కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులతో మెకానిక్ గొడవ పడ్డాడనే విషయం తమకు తెలిసిందని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.