ఓసిసిఆర్‌పి నివేదికతో పడిపోయిన అదానీ సంస్థల షేర్లు

నవతెలంగాణ- న్యూఢిల్లీ :  ఓసిసిఆర్‌పి నివేదికతో గురువారం అదానీ సంస్థల షేర్ల విలువ భారీగా గాణపడిపోయాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సుమారు 4 శాతానికి పైగా క్షీణించింది. అదానీ పవర్‌ 3.82శాతానికి పడిపోయి రూ. 315.85కి చేరగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.56శాతం క్షీణించి రూ.2,424కి చేరింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 3.18 శాతం తగ్గి రూ. 814.95కి చేరింది. అలాగే అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఎపిఎస్‌ఇజెడ్‌) 2.75 శాతం క్షీణించగా, టోటల్‌ గ్యాస్‌ 2.74 శాతానికి పడిపోయింది. ఎన్‌డిటివిలో అదానీ షేర్లు కూడా 2.74 శాతం తగ్గాయి.

Spread the love