- Advertisement -
నవతెలంగాణ – సిద్దిపేట
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ మధ్యనే ఆమె పట్టణంలోని మల్టీపర్పస్ హై స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు భోజనానికి ఇంటికి వెళ్లడం, మరికొందరు ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయకపోవడం, ఎఫ్ ఆర్ ఎస్ సరిగా వేయకపోవడం వంటి అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. వెంటనే కలెక్టర్ డిఈఓకు ఫోన్ చేసి సమగ్రమైన విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం ఆరుగురు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని డీఈఓ తేల్చి చెప్పారు. దీంతో కలెక్టర్ వారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
- Advertisement -



