హైదరాబాద్ : శ్రీ భవానీ జ్యువెల్స్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతైతే బంగారం కొంటారో అంతే బరువు గల వెండిని ఉచితంగా పొందవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ వినోద్ కుమార్ బంగ్, రిటైల్ సేల్స్ హెడ్ రవి కిరణ్ మల్లకేడి తెలిపారు. వెండి వస్తువులు, ఆభరణాలకు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ వసూలు చేయడం లేదన్నారు తమ సంస్థ 1966 నుంచి వినియోగదారులు విశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతుందన్నారు. తమ సంస్థకు నాగోల్, మలక్పేట్, హిమాయత్నగర్, కూకట్పల్లి-జెఎన్టియులో స్టోర్స్ ఉన్నాయన్నారు. తమ సంస్థకు డైరెక్టర్లుగా వినోద్ కుమార్ బంగ్, ప్రమోద్ కుమార్ బంగ్, కృష్ణ సంగి, ఆనంద్ సంగి ఉన్నారన్నారు.