పారిశుద్ధ్యం, త్రాగునీటి, సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: శ్రీనివాసరావు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం త్రాగునీటి సమస్య ల పై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో మండల గ్రామ కార్యదర్శిలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజ్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య హాజరయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని సూచించడం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు
Spread the love